Sensex Closing Bell | దేశీయ బెంచ్మార్క్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు జీవనకాల గరిష్ఠానికి చేరగా మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో భారీగా పతనమయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్ నష్టాలతో మొదలైంది. నిఫ్టీ స్వల్ప లాభాలతో మొదలైనా ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. సూచీలు ఇంట్రాడేలోనూ కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ 379.46 పాయింట్లు పతనమై 71,892.48 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 76.10 పాయింట్లు తగ్గి 21,665.80 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దాదాపు 1,691 షేర్లు పురోగమించగా.. 1,631 షేర్లు పతనమయ్యాయి. 72 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్గా నిలిచాయి. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్ మరియు సిప్లా లాభపడ్డాయి. సెక్టార్లలో, ఫార్మా ఇండెక్స్ 2.5 శాతం పెరగ్గా.. ఆటో, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక్కొక్కటి ఒక్కో శాతం తగ్గాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి.