Sensex Closing Bells | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. భారీగా అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యతిరేక పవనాలు, త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో క్షీణించాయి. స్టాక్ మార్కెట్లు గరిష్ఠానికి చేరుకున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు పతనయ్యాయి. సెన్సెక్స్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 72,116 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో ఓ దశలో 71,301 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 670.93 పాయింట్ల పతనమై.. 71,355.22 వద్ద ముగిసింది.
మరోవైపు, నిఫ్టీ 197.80 పాయింట్లు పతనమై 21,513.00 వద్ద స్థిరపడింది. దాదాపు 1,733 షేర్లు పురోగమించగా.. 1,723 షేర్లు పతనమయ్యాయి. 75 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో యూపీఎల్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ టాప్ లూజర్గా నిలిచాయి. అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంక్, ఫార్మా, మెటల్ రంగాల షేర్లు ఒక్కోశాతం శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పడిపోయాయి.