Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడో సెషన్లో సూచీలు లాభాలను నమోదు చేశాయి. సూచీలు ఇవాళ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 71,383.20 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడేలో 71,11098 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. 71.773.54 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 271.50 పాయింట్లు పెరిగి 71,657.71 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 73.90 పాయింట్లు లాభంతో 21,618.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు 1,772 షేర్లు పురోగమించగా.. 1,495 షేర్లు క్షీణించాయి. 75 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఓఎన్టీసీ, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నష్టపోయాయి. సెక్టార్లలో హెల్త్కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్ ఒక్కొక్కటి 0.4శాతం చొప్పున పెరగ్గా.. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి.