పబ్లిక్ ఆఫర్ ముసాయిదా డాక్యుమెంట్కు ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 9: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న సెబీకి ఎల్ఐసీ సమర్పించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ముసాయిదా ప్రాస్పెక్టస్కు తాజాగా రెగ్యులేటర్ అనుమతి లభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతవరకూ ఏ కంపెనీ ఐపీవో పొందనంత వేగంగా నెలరోజుల్లోపునే ఎల్ఐసీకి సెబీ అనుమతినివ్వడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని పూర్తిచేసే దిశగా ప్రభుత్వం..ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 63,000 కోట్ల సమీకరణకు ఇది ఉపకరిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అతిపెద్ద పబ్లిక్ ఆఫర్
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎల్ఐసీదే అతిపెద్ద ఐపీవో కానుంది. ఇప్పటివరకూ దేశంలో వచ్చిన పెద్ద ఐపీవోల్లో పేటీఎం (2001 సంవత్సరంలో రూ.18,300 కోట్లు), కోల్ ఇండియా (2010లో రూ.15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఉన్నాయి. ఈ ఐపీవోలకంటే ఎల్ఐసీ ఇష్యూ విలువ పరిమాణం మూడు రెట్లు అధికంగా ఉంటుందని అంచనా.
ప్రాస్పెక్టస్ వివరాలు..