న్యూఢిల్లీ, జూన్ 29: ఇండిపెండెంట్ డైరెక్లర్ల నియామకం, తొలగింపు నిబంధనల్ని సవరించడంతోపాటు పలు అంశాల్ని మా ర్కెట్ రెగ్యులేటర్ సెబీ బోర్డు ఆమోదించింది. తాజా నిబంధనల ప్రకారం ఇండిపెండెంట్ డైరక్లర్ల నియామకం, పునర్నియామకం, తొలగింపు ఇకమీదట షేర్హోల్డర్ల తీర్మానం ద్వారానే జరగాలి. ఇన్సైడర్ ట్రేడింగ్పై సమాచారం అందించివారికి రివార్డును రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచుతూ మంగళవారం సమావేశంలో నిర్ణ యం తీసుకుంది. పెట్టుబడి సాధనాల గురించి అవగాహన వున్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు, ట్రస్ట్లు, హెచ్యూఎఫ్లు, భాగస్వామ్య సంస్థలు, కార్పొరేట్ బాడీలను అక్రిడిటేడ్ ఇన్వెస్టర్లుగా గుర్తించే ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు పబ్లిక్ ఆఫర్లలో ఇన్వెస్ట్చేసేందుకు కనీస దరకాస్తు మొత్తాన్ని రూ. 10,000-15,000కు సెబి తగ్గించింది.