ఎంసీఎల్ఆర్ని 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్
న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు మరోసాకి షాకిచ్చింది. ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్న బ్యాంక్..మరోసారి వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించింది. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల రుణాలపై వడ్డీరేటును పెంచేసింది.
బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.50 శాతానికి సవరించింది. దీంతోపాటు ఒక్కరోజు, మూడు, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ని కూడా పెంచేసింది. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పెంచిన నాటినుంచి ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ని క్రమంగా పెంచుతున్నది. గత నెలలోనూ ఎంసీఎల్ఆర్ని 20 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. అలాగే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండిగ్ రేటును కూడా సవరించింది.