హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూబీఐ, పీఎన్బీ, బీవోబీ తదితర బ్యాంకులు డిజిటల్ రుపీతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇంటరాపరబిలిటీని పరిచయం చేశాయి. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ లేదా ఈ-రుపీ)తో యూపీఐ క్యూఆర్ కోడ్ను అనుసంధానించాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఇకపై తమ డిజిటల్ రుపీ వ్యాలెట్లలోని సీబీడీసీల ద్వారా చెల్లింపులు జరిపే వెసులుబాటు కలిగింది. దుకాణాలు, ఇతరత్రా వ్యాపార సముదాయాల్లో ప్రస్తుతమున్న సింగిల్ క్యూఆర్ కోడ్ ద్వారానే స్కాన్ చేసి కొన్నవాటికి ఈ-రుపీలతో చెల్లిం పులు చేసుకోవచ్చు.