ముంబై, మార్చి 24: దేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించింది. డాలర్కు డిమాండ్ కొనసాగుతుండటంతో ఇతర కరెన్సీలు ఢీలాపడుతున్నాయి. ఇదే క్రమంలో రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 23 పైసలు పతనం చెంది ఆల్టైం కనిష్ఠ స్థాయి 93.76 వద్ద ముగిసింది.
క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమనడం, ఎఫ్ఐఐలు నిధులు వెనక్కి తీసుకోవడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం రూపాయి పతనానికి ఆజ్యంపోసినట్టు ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.