న్యూఢిల్లీ, జనవరి 31: పాతాళంలోకి పడిపోతున్న రూపాయి విలువ మరింత దిగజారే ప్రమాదం ఉన్నదని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఎగుమతులు నిరుత్సా హకరంగా ఉండటంతోపాటు కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) మరింత పెరగనుండటంతో దేశీయ కరెన్సీకి మరిన్ని తిప్పలు తప్పవని ఆర్థిక సర్వే 2022-23 హెచ్చరించింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీ య పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వు తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను క్రమంగా పెంచుతుండటంతో డాలర్తో పోలిస్తే మారకం విలువ 83 స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. వీటికితోడుగా కమోడిటీ ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతుం డటం, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగు తున్న యుద్ధం కూడా రూపాయి పతనానికి ఆజ్యం పోయనున్నదని తెలిపింది. దేశీయంగా కమోడిటీ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా దిగుమతుల కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి రావచ్చునని వెల్లడించింది. మరోవైపు, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 41 పైసలు తగ్గి 81.93 స్థాయికి జారుకున్నది.
మోదీ హయాంలో 36 శాతం డౌన్
నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశీయ కరెన్సీ విలువ పాతాళంలోకి పడిపోయింది. 2014 మే నెలలో 61 స్థాయిలో ఉన్న డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ గతేడాది అక్టోబర్ నెలలో 83 స్థాయికి జారుకున్నది. అంటే 36 శాతం మేర పతనమైంది. రూపాయి పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి ఫారెక్స్ రిజర్వులను భారీ స్థాయిలో విక్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.
కనిష్ఠ స్థాయి: అక్టోబర్ 19, 2022లో 83.26 స్థాయికి
సరాసరి స్థాయి: 2022లో 81.26 స్థాయిలో కదలాడింది
గరిష్ఠ స్థాయి: ఆగస్టు 2, 2022న 78.60గా నమోదైంది