Gold Price | సోమవారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి బంగారం దిగుమతిని జీ-7 దేశాలు నిషేధించాయి. ఈ క్రమంలో మున్ముందు బంగారం ధర పైపైకి దూసుకెళ్తుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఎగుమతుల్లో రష్యాది రెండో స్థానం. ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెబ్సైట్ ప్రకారం తులం 24 క్యారట్ల బంగారం ధర రూ.192 పెరిగి రూ.51,021లకు చేరుకున్నది.
కానీ, ఫ్యూచర్స్ మార్కెట్లో మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రూ.262 తగ్గి రూ.50,885 పలికింది. 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.51,021 కాగా, 23 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.50,817, 22 క్యారట్ల తులం బంగారం ధర రూ.46,735, 18 క్యారట్ల తులం బంగారం రూ.38,266 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1837 డాలర్లకు చేరుకుంది.
కిలో వెండి ధర రూ.1,157 పెరిగి రూ.60,507కు చేరుకున్నది. ఫ్యూచర్స్ మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు రూ.709 పెరిగి రూ.60,458 పలికింది. గ్లోబల్మార్కెట్లో ఔన్స్ వెండి ధర 21.47 డాలర్లకు చేరుకున్నది. ఇప్పుడు ఇంటి వద్దే కూర్చుని బంగారం, వెండి ధరలు తెలుసుకోవచ్చు. 8955664433 అనే మొబైల్ నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే ఎస్సెమ్మెస్ రూపంలో బంగారం, వెండి ధరల సమాచారం లభిస్తుంది.