న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీకి రిజర్వు బ్యాంక్ శుభవార్తను అందించింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతోపాటు నాలుగు బ్యాంకుల్లో తన వాటాను 9.5 శాతం వరకు పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ మంగళవారం అనుమతినిచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్తోపాటు హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతోపాటు ఇతర సంస్థలకు అనుమతినిచ్చింది.
యాక్సిస్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ల్లో వాటాను 9.5 శాతం వరకు ఫిబ్రవరి 4, 2025 వరకు పెంచుకునేందుకు గ్రీన్సిగ్నల్ లభించినట్లు అయింది.