ముంబై, డిసెంబర్ 28: బ్యాంకులు బల్క్ డిపాజిట్లపై ఆధారపడకుండా ఉండాలని రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే సూచించారు. అధిక కాలపరిమితి, డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరుగుతుండటంతో బ్యాంకుల లాభాల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ అండ్ ఎకానమీ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో డిపాజిట్లపై వడ్డీరేట్లు భారీగా పెరుగుతున్నప్పటికీ, మరోవైపు రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతుండటం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. తక్కువ మార్జిన్లు బ్యాంకుల లాభాలను మింగివేయవచ్చునన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి బ్యాంకుల మొండి బకాయిలు రికార్డు స్థాయికి తగ్గాయి. సెప్టెంబర్ 2023 నాటికి బ్యాంకుల ఎన్పీఏల నిష్పత్తి 0.8 శాతానికి పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ పేర్కొంది.