Reliance | ఇన్వెస్టర్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ వాటాదారుల 45వ వార్షిక సమావేశం సోమవారం జరుగనున్నది. వాటాదారులను డిజిటల్గా కనెక్ట్ చేయడానికి వర్చువల్ రియాల్టీ ప్లాట్ఫామ్తోపాటు ఐదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై లైవ్ స్ట్రీమ్ ప్రసారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం జరిగే ఏజీఎంలో రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ముకేశ్ అంబానీ వర్చువల్గా వాటాదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఒక కార్పొరేట్ సంస్థ వార్షిక సమావేశం జియోమీట్ బ్రాడ్కాస్ట్తోపాటు అదనంగా ఐదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై లీవ్ స్ట్రీమ్ కావడం ఇదే తొలిసారి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన ముఖ్యాంశాలను తెలిపేందుకు రిలయన్స్ ఏజీఎం వర్చువల్ రియాల్టీ (వీఆర్) ప్లాట్ఫామ్ను జీమెట్రీ డిజైన్ చేసింది. డిజిటల్ వీక్షకుల కోసం కూ (Koo), ఇన్స్టాగ్రామ్ (Instagram)ల్లోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు యూ-ట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లపై రిలయన్స్ ఏజీఎం లైవ్ స్ట్రీమ్ మొదలవుతుంది.
వాట్సాప్లో కనెక్ట్ కావడానికి రిలయన్స్ తన వాట్సాప్ చాట్బోట్ 7977111111 యాక్టివేట్ చేసింది. ఈ చాట్బోట్లో `hi` అని మెసేజ్ పంపితే ఏజీఎం తేదీ, ప్రారంభ సమయం తదితర వివరాలు తెలుస్తాయి. లైవ్లో ఎలా వీక్షించాలి, వాటాదారు ప్రశ్నలు వేయడానికి చాట్బోట్ ఉపకరిస్తుంది.