న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) లోకి మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. తాజాగా అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ) రూ.4,966.80 కోట్లతో 0.59 శాతం వాటా కొనుగోలు చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.
రిలయన్స్ రిటైల్ విలువను రూ.8.381 లక్షల కోట్లు (100.83 బిలియన్ డాలర్లు)గా పరిగణించి ఈ పెట్టుబడి వచ్చినట్టు ఆర్ఐఎల్ వెల్లడించింది. దీంతో దేశంలో అత్యధిక విలువ కలిగిన నాలుగు కంపెనీల్లో ఒకటిగా ఆర్ఆర్వీఎల్ నిలిచిందని పేర్కొంది. రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 18,500 స్టోర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా గ్రోసరీ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్ైస్టెల్, ఫార్మా ఉత్పత్తులను విక్రయిస్తున్నది.