న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ స్టోర్లలో ఐఫోన్ 15ని కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో రూ.2,394 విలువైన ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. దీంట్లోభాగంగా ఆరు నెలలపాటు రూ.399 ప్లాన్ను ఉచితంగా అందించనున్నది. ఈ ప్లాన్ కింద రోజుకు 3 జీబీ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చును.
దీంతోపాటు రూ.149 లేదా అంతకంటే విలువైన నూతన ప్రీపెయిడ్ ప్లాన్లకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నది. ఇతర టెలికం సంస్థల కస్టమర్లు నూతన సిమ్ లేదా ఎంఎన్పీ కింద తమ నంబర్ను మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ ఫోన్ రూ.79,900 నుంచి రూ.1,99,900 ధరల శ్రేణిలో లభించనున్నది.