హైదరాబాద్, సెప్టెంబర్ 15: వినాయక చవితి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్లో కొనుగోలు చేసే ఏ టెక్నాలజీ ఉత్పత్తినైనా గణేష్ చతుర్థి డే సెప్టెంబర్ 19న డెలివరీ, ఇన్స్టాలేషన్ చేయనున్నట్టు తెలిపింది.
అన్ని బ్యాంక్ కార్డులపై రూ.5,000 తక్షణ డిస్కౌంట్, ప్రధాన బ్యాంక్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తామని రిలయన్స్ డిజిటల్ పేర్కొంది. ఈ ఆఫర్ల కోసం రిలయన్స్ డిజిటల్ స్టోర్, మై జియో స్టోర్లను సందర్శించాలని లేదా రిలయన్స్డిజిటల్.ఇన్లో లాగిన్ అయ్యి కొనుగోలు చేయవచ్చని వినియోగదారులకు సూచించింది.