న్యూఢిల్లీ : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్జీపీటీ (ChatGPT) రాకతో లేటెస్ట్ టెక్నాలజీ టెకీల్లో హాట్ టాపిక్గా మారింది. ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్పదని, న్యూ టెక్నాలజీతో వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. రాబోయే రోజుల్లో ఏఐ టూల్స్ విధ్వంసానికి భారీ మూల్యం చెల్లించకతప్పదని పలువురు టెక్ దిగ్గజ కంపెనీ సీఈవోలు సైతం హెచ్చరించారు. అయితే ఏఐతో ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని, లేటెస్ట్ టెక్నాలజీ జాబ్స్లో మానవులను రీప్లేస్ చేయలేదని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐఎల్ఓ) ఇటీవల వెల్లడించిన అధ్యయనం ఏఐపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలపడం టెకీలకు రిలీఫ్ ఇచ్చింది. మనం చేసే పనులను ఏఐ మార్చేస్తుంది తప్ప ఉద్యోగాల నుంచి మనుషులను తీసివేయదని ఐఎల్ఓ రిపోర్ట్ తేల్చిచెప్పింది. ఏఐ రాకతో ఎన్నో ఉద్యోగాలు, పరిశ్రము కేవలం పాక్షికంగానే యాంత్రీకరణకు గురవుతాయని పేర్కొంది.
చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ తాజా వేవ్ ఫలితంగా ఇది కంపెనీలకు వరంగానే మారుతందని, ఉద్యోగులను రీప్లేస్ చేయడం వంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఐఎల్ఓ అధ్యయన నివేదిక తేల్చిచెప్పింది. లేటెస్ట్ టెక్నాలజీతో ఉపాధి విధ్వంసం ఉండదని, నాణ్యతతో కూడిన ఉద్యోగాలు, పనుల్లో వేగం వంటి మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది. నూతన టెక్నాలజీ ప్రభావం ఆయా వృత్తులు, ప్రాంతాలకు అనుగుణంగా వేర్వేరుగా ఉంటాయని వెల్లడించింది. లేటెస్ట్ టెక్నాలజీ పురుషులతో పోలిస్తే మహిళల ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం అధికమని నివేదిక అంచనా వేసింది.
Read More :