ఆన్లైన్ పేమెంట్ గేట్వే విధానం, డెబిట్/క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వినియోగదారుల డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ నిబంధనలు తెచ్చినట్టు పేర్కొంది. ‘న్యూ పేమెంట్ అగ్రిగేటర్/పేమెంట్ గేట్వేస్ (పీఏ/పీజీ)’ పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయన్నది. అయితే, ఈ నిబంధనలను అమలుచేయడానికి పేమెంట్ గేట్వే సంస్థలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.
ఆన్లైన్ వినియోగదారుల డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా, పేమెంట్ సంస్థలు యూజర్ల కార్డు వివరాలను ఇతర సంస్థలతో పంచుకోకుండా ఈ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ ఏడాది జస్పే, మొబిక్విక్, ఎయిరిండియా, అప్స్టోక్ వంటి పేమెంట్ గేట్వే సర్వర్లపై సైబర్ దాడులు జరిగి కస్టమర్ల డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలను సైబర్ నేరగాళ్లు దొంగిలించడం తెలిసిందే.
ఆర్బీఐ నుంచి లైసెన్సులు పొందిన పేమెంట్ గేట్వే సంస్థలు మాత్రమే కస్టమర్ల ‘టోకెనైజ్డ్ కీ’ని యాక్సెస్ చేయగలవు. లైసెన్సుల దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు.
ఆన్లైన్లో చెల్లింపులు జరిపే వినియోగదారుడి డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను పేమెంట్ గేట్వే సంస్థలు సర్వర్లలో నిక్షిప్తం చేసుకోవద్దు.
అప్పటికే రికార్డయిన కార్డు వివరాల సాయంతో సీవీవీ నంబర్ ఆధారంగా జరిపే వన్-క్లిక్ చెక్అవుట్ సర్వీసులను ఇకపై నిలిపివేయాలి.
చెల్లింపులు జరిపే ప్రతీసారి వినియోగదారుడు 16 అంకెల కార్డు నంబర్ను విధిగా నమోదు చేయాలి. ఈ నంబర్ను ఆ లావాదేవీ పూర్తయ్యేవరకే సర్వర్లో ‘టోకెనైజ్డ్ కీ ’ రూపంలో ఉంచాలి. లావాదేవీ పూర్తవ్వగానే ఆ వివరాలను తీసెయ్యాలి.
ఒకవేళ లావాదేవీ అసంపూర్ణంగా పూర్తయితే..‘టోకెనైజ్డ్ కీ’ సాయంతో వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో సొమ్మును జమచేయాలి. దీన్ని ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది.
ఆర్బీఐ నుంచి లైసెన్సులు పొందిన పేమెంట్ గేట్వే సంస్థలు మాత్రమే కస్టమర్ల ‘టోకెనైజ్డ్ కీ’ని యాక్సెస్ చేయగలవు. లైసెన్సుల దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు.
? ఆన్లైన్ లావాదేవీ జరిపిన ప్రతిసారి కస్టమర్ 16 అంకెల డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదుచేయడం వారికి కష్టంగా మారొచ్చు. దీంతో ఆసక్తి సన్నగిల్లి కొనుగోళ్ల రేటు తగ్గొచ్చు. కాబట్టి, కొత్త నిబంధనలను అమలుచేయొద్దు. ఈ వాదనను ఆర్బీఐ తోసిపుచ్చింది.
? లావాదేవీలు ఫెయిల్ అయిన వినియోగదారుల కార్డు వివరాలను లైసెన్స్ పొందిన పేమెంట్ గేట్వే సంస్థలు ప్రత్యేక సర్వర్లలో స్టోర్ చేసుకునేందుకు అవకాశమివ్వాలి. ఇది వన్-క్లిక్ చెక్అవుట్కు సాయంగా ఉంటుంది.
? కొత్త నిబంధనల అమలుకు 2022 జనవరి తుదిగడువు. దీనిని పొడిగించాలి. ఈ విజ్ఞప్తిని ఆర్బీఐ నిరాకరించింది. 2021జూలైకి గడువు ముగియగా ఆరు నెలలు పొడిగించినట్టు గుర్తుచేసింది.