ముంబై, ఫిబ్రవరి 26: మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్లపై రూ.3 కోట్ల జరిమానా విధించింది. నియంత్రణ నిబంధనలు ఉల్లఘించడంతో ఎస్బీఐపై రూ.2 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ..సిటీ యూనియన్ బ్యాంక్పై రూ.66 లక్షలు వేసింది.
ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించకపోకపోవడంతో కెనరా బ్యాంక్పై రూ.32.30 లక్షలు జరిమానా విధించింది. దీంతోపాటు ఒషియన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్పై కూడా రూ.16 లక్షలు వేసింది.