RBI on Axis & IDBI | రెండు ప్రైవేట్బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. కేవైసీ మార్గదర్శకాలతోపాటు యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ పలు ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. దీంతో యాక్సిస్ బ్యాంకుపై రూ.93 లక్షలు, ఐడీబీఐ బ్యాంకుపై రూ.90 లక్షల పెనాల్టీ విధించింది. రుణాల మంజూరు, సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వల నిర్వహణలో వైఫల్యం, నో యువర్ కస్టమర్ (కేవైసీ), తదితర సర్వీసుల్లో యాక్సిస్ బ్యాంక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆర్బీఐ తనిఖీలో తేలింది. సైబర్ సెక్యూరిటీ, మోసాలకు సంబంధించిన అంశాల్లో పలు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐడీబీఐపై ఆర్బీఐ జరిమానా విధించింది.
స్టాక్ బ్రోకర్లకు ఇంట్రాడే లావాదేవీల నిర్వహణలో వారి ఖాతాల్లో నిర్దేశిత కనీస నిల్వలను కొనసాగించడంలో యాక్సిస్ బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ నిర్ధారించింది. కస్టమర్లకు బీమా ఉత్పత్తుల విక్రయంలోనూ సంబంధిత పద్దతులను కూడా పాటించలేదని తెలిపింది. క్లయింట్లు సమర్పించిన పత్రాల ఒర్జినల్స్తో తనిఖీ చేసుకోలేదని పేర్కొంది. విశ్వసజనీన ఖాతాదారు గుర్తింపు కోడ్ (యూసీఐసీ)కి బదులు పలు సీఐఎఫ్ల్లో కొన్ని కస్టమర్ ఐడీలు ఉన్నట్లు నిర్ధారించింది.
2019 జూన్ 8,9 తేదీల్లో ఐడీబీఐ బ్యాంకుల్లో పలు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ నిర్ధారించింది. ఇద్దరు కార్పొరేట్ నెట్ బ్యాంకింగ్ ఖాతాదారుల (కో-ఆపరేటివ్ బ్యాంక్లు) ఖాతాల్లో ఇదంతా జరిగినట్లు పేర్కొంది. రూ.5 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలో మోసపూరిత లావాదేవీలు జరిగిందని ఆర్బీఐకి ఇచ్చిన నివేదికలో యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ లావాదేవీలపై ఫ్లాష్ రిపోర్ట్ ఇవ్వడంలోనూ జాప్యం జరిగిందని వెల్లడించింది. సెలవు దినాల్లో ఆంక్షలు పాటించడంలోనూ ఐడీబీఐ విఫలమైంది. కార్పొరేట్ నెట్బ్యాంకింగ్ డేటా యాక్సెస్ సౌకర్యం కల్పించడంతో రెండు కోఆపరేటివ్ బ్యాంకుల ఖాతాల్లో అనధికారిక చెల్లింపుల లావాదేవీలు జరిగాయని ఆ