HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా శశిధర్ జగదీశన్ పదవీ కాలం మరో మూడేండ్లు పొడిగించారు. ఈ విషయమై బోర్డు తీసుకున్న నిర్ణయానికి ఆర్బీఐ ఆమోదం తెలిపిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
తాజాగా ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల మేరకు వచ్చేనెల 27 నుంచి 2026 అక్టోబర్ 26 వరకూ హెచ్డీఎఫ్సీ ఎండీ కం సీఈఓగా శశిధర్ జగదీశన్ కొనసాగుతారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) విలీనమైన కొన్ని నెలలకే శశిధర్ జగదీశన్ పదవీ కాలం పొడిగించారు. ఎస్బీఐ తర్వాత హెచ్డీఎఫ్సీ విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు రెండో అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం గత జూలై ఒకటో తేదీన జరిగింది.
తొలిసారిగా 1996లో హెచ్డీఎప్సీ బ్యాంకులో శశిధర్ జగదీశన్ చేరారు. ఫైనాన్స్ విభాగం మేనేజర్గా మొదలైన ఆయన కెరీర్.. 2009లో బ్యాంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ స్థాయికి చేరుకున్నది. తొలిసారి 2020లో బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండీ కం సీఈఓ ఆదిత్య పూరి స్థానంలో శశిధర్ జగదీశన్ నియమితులయ్యారు.