న్యూఢిల్లీ, జనవరి 13: గడిచిన పదేండ్లుగా రికార్డు స్థాయిలో పెరిగిన రూపాయి విలువ క్రమంగా తగ్గనున్నదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ బలహీనంగా ట్రేడవుతుండటం, దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తుండటంతో భవిష్యత్తులో రూపాయి కోలుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
దేశ వృద్ధిని పరుగులు పెట్టించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్లు గట్టిగానే కృషి చేస్తున్నాయని, అయినప్పటికీ ఆశించిన స్థాయికి చేరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. వృద్ధికి ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటున్నదని, ముఖ్యంగా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ త్వరలో అవతరించనున్నదన్నారు.
ప్రస్తుతం స్థిరంగా ఉన్న రూపాయి, ఏడాదిలో 3 శాతం నుంచి 3.5 శాతం వరకు తన విలువను కోల్పోతున్నదని, దేశ ఆర్థిక వ్యవస్థ చేడు చేస్తున్నదని చెప్పారు. వచ్చే పదేండ్లలో రూపాయి విలువ అర శాతం నుంచి 0.75 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయి ఇండియా బ్యాంకింగ్ కన్క్లేవ్ ఏర్పాటు చేసిన సదస్సులో పేర్కొన్నారు.