న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఆటో డ్రైవర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రముఖ రవాణా సదుపాయాల సంస్థ ర్యాపిడో..ప్రత్యేకంగా జీరో కమిషన్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఆటో డ్రైవర్లు తమ రవాణా బుకింగ్లపై జీవితకాలం ఎలాంటి చెల్లింపులు జరుపాల్సిన అవసరం లేదు.
ఈ సందర్భంగా ర్యాపిడో కో-ఫౌండర్ పవర్ గుంటుపల్లి మాట్లాడుతూ..ప్రతిరోజు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది ఆటో రైడ్లు జరుగుతుండగా, వీరిలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ జీరో కమిషన్తో ఆఫ్లైన్ డ్రైవర్లు కూడా ఆన్లైన్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ర్యాపిడో రోజుకు 17 లక్షల రైడ్స్ నిర్వహిస్తుండగా, ఈ ఏడాది చివరినాటికి 30 లక్షలకు పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.