శేరిలింగంపల్లి, డిసెంబర్ 8: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయ సంస్థయైన క్వాంటమ్ ఎనర్జీ..రాష్ట్రంలో తన తొలి షోరూంను ప్రారంభించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్లో ఏర్పాటు చేసిన ఈ షోరూంను రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈవీ వాహనాల వాడకాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ముఖ్యంగా ఈవీ పాలసీని విడుదల చేసినట్లు చెప్పారు.
ఈ షోరూంలో కంపెనీకి చెందిన అన్ని రకాల ఈవీ స్కూటైర్లెన్లను డిస్ప్లే చేయనున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా త్వరలో సికింద్రాబాద్, వరంగల్లో కూడా షోరూంలను ప్రారంభించనున్నట్లు కంపెనీ డైరెక్టర్ చక్రవర్తి చుక్కపల్లి తెలిపారు. నాలుగు గంటల్లో గంటకు 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల రేంజ్లో నాలుగు మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది సంస్థ.