హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ..హైదరాబాద్లో మరో షోరూంను ప్రారంభించింది. 630 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మోటర్స్ నిర్వహిస్తున్నది.
తెలంగాణలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో నాలుగో షోరూంను ఏర్పాటు చేసినట్లు క్వాంటమ్ ఎనర్జీ ఎండీ చక్రవర్తి తెలిపారు. వాహన విక్రయాలతోపాటు సర్వీసు, విడిభాగాలను సైతం ఈ షోరూంలో అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. దీంతో దేశంలో సంస్థకు ఉన్న షోరూంల సంఖ్య 43కి చేరుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థ నాలుగు రకాల మాడళ్లను మార్కెట్లో విక్రయిస్తున్నది.