న్యూఢిల్లీ, జూన్ 16: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషీ సమక్షంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు శుక్రవారం అందజేశారు.
ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.11.3 చొప్పున డివిడెండ్ను 2022-23 కోసం ఎస్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.