EPFO | న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్( Provident Fund ) పై 8.15 శాతం వడ్డీని నిర్ణయించారు. పీఎఫ్పై 8.15 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్వో( EPFO ) నిర్ణయించింది. మంగళవారం జరిగిన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్( CBT ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. గతేడాది పీఎఫ్పై 8.10 శాతం వడ్డీ పెంచారు. దాన్ని ఈ ఏడాది మరో 5 శాతానికి పెంచారు. తాజా నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు ఈపీఎఫ్వో పంపనుంది. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్వో 5 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఈపీఎఫ్వో అధికారికంగా ప్రకటించనుంది.