Postal Schemes | మదుపరులకు లాభాలివే సురక్షితమైన పెట్టుబడులను కోరుకునేవారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం ఓ చక్కని అవకాశం. ఇందులో మదుపరికి నెలనెలా వడ్డీ చెల్లింపులుంటాయి. మూడు నెలలకోసారి కేంద్రం వడ్డీరేట్లను సవరిస్తుంది.
సింగిల్గానైనా, జాయింట్గానైనా ఈ స్కీంలో చేరవచ్చు. జాయింట్ అకౌంట్లో ముగ్గురిదాకా వీలుంటుంది. మైనర్ల తరఫున వారి గార్డియన్లు తీసుకోవచ్చు. అలాగే పదేండ్లు నిండిన మైనర్ సొంతంగా చేరవచ్చు.
వెయ్యి రూపాయలకు తగ్గకుండా గరిష్ఠంగా సింగిల్ అకౌంట్లో రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్లో రూ.15 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్లో ముగ్గురుంటే ఒకొక్కరు రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఖాతా తెరిచిన ఐదేండ్ల వరకే ఈ స్కీం నడుస్తుంది. ఒకవేళ మెచ్యూరిటీ గడువు లోపలే డిపాజిట్దారు చనిపోతే నామినీ లేదా చట్టపరమైన వారసులకి సదరు మొత్తాన్ని చెల్లిస్తారు. స్కీం తీసుకున్న ఏడాది-మూడేండ్ల మధ్య కాలంలో ఖాతాను ఉపసంహరించుకుంటే డిపాజిట్ చేసిన మొత్తంలో 2 శాతానికి సమానమైన నగదును కోత పెడుతారు.
ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికిగాను వార్షిక వడ్డీరేటు 7.4 శాతంగా ఉన్నది. నెలనెలా దీన్ని చెల్లిస్తారు. మీరు ఖాతా తెరిచిన దగ్గర్నుంచే లెక్క మొదలవుతుంది. అక్కడి నుంచి నెలనెలా ఆదాయం వస్తుంది. ఒకవేళ ఈ ఆదాయాన్ని తీసుకోనైట్టెతే.. దీనిపైనా అదనపు అదాయాన్ని అందుకోవచ్చు. కాగా, వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ పడుతుంది. చాలా పోస్టాఫీస్ పథకాల తరహాలో ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద ఈ మంత్లీ ఇన్కమ్ స్కీంకు పన్ను ప్రయోజనాలు అందవు.