PayU | డచ్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రొరస్ ఇండియా అనుబంధ సంస్థ పేయూ పేమెంట్స్ ( PayU Payments) కన్సాలిడేటెడ్ రెవెన్యూ 50 శాతం పెంచుకున్నది. గతేడాదితో పోలిస్తే నికర నష్టాలను అధిగమించి అదే స్థాయిలో నికర లాభం గడించింది. 2021-22 లో సంస్థ ఆదాయం రూ. 2,130.2 కోట్లకు చేరుకున్నది. ఇదే ఏడాది సంస్థ నికర లాభం రూ. 125.8 కోట్లుగా నమోదైంది. గతేడాది మార్చితో ముగిసిన (2020-21)లో సంస్థ కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ. 1,415.67 కోట్లు కాగా, నికర నష్టం రూ. 114.6 కోట్లు నమోదైంది.
2020-21తో పోలిస్తే 2021-22ay సంస్థ ఆపరేటింగ్ రెవెన్యూ రూ. 1,393.8 కోట్ల నుంచి రూ.2,099.4 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ. 1,530.3 కోట్ల నుంచి రూ. 2,229.5 కోట్లకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే పే యూ రెవెన్యూ 45% శాతం పెరిగి 796 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఇండియా పేమెంట్ బిజినెస్ పుంజుకోవడంతోపాటు క్రెడిట్స్లో స్ట్రాంగ్ రికవరీ నమోదైంది. టోటల్ పేమెంట్ విలువ 66% పెరిగి 43.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని ప్రోరస్ తెలిపింది.