Paytm on ED Scanner | చైనీస్ లోన్ యాప్ కేసుతో తమకు సంబంధం లేదని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న మర్చంట్లతో తమకు ఎటువంటి లింక్లు లేవని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈడీ ఆస్తులు జప్తు చేసిన సంస్థలు, మర్చంట్ల జాబితాలో తమ గ్రూప్ వారెవ్వరూ లేరని వివరించింది.
`కొంత మంది మర్చంట్లపై దర్యాప్తులో భాగంగా వారికి సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని ఈడీ మమ్ముల్ని కోరింది. స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మర్చంట్లతో మాకు సంబంధం లేదని వివరణ ఇచ్చాం` అని పేటీఎం రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
శనివారం బెంగళూరు కేంద్రంగా రేజోర్ పే, పేటీఎం, క్యాష్ ఫ్రీ సంస్థల ఆధ్వర్యంలో ఆన్లైన్ పేమెంట్ లావాదేవీలు నిర్వహిస్తున్న ఆరు చోట్ల ఈడీ అధికారులు దాడులు జరిపారు. చైనీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టంట్ యాప్బేస్డ్ లోన్ సంస్థల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈడీ దాడుల్లో రూ.17 కోట్ల నిధులు జప్తు చేసిన సంగతి తెలిసిందే.