న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు. మంగళవారమే ఈ సమావేశం జరిగినట్టు బుధవారం సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది. అయితే కేవలం 10 నిమిషాలపాటే ఇరువురు మాట్లాడుకున్నట్టు చెప్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లేవనెత్తిన పలు సమస్యలు, సంస్థ ప్రస్తుత పరిస్థితి గురించి మంత్రికి ఈ సందర్భంగా శర్మ వివరించినట్టు సమాచారం. ఇదిలావుంటే ఫిబ్రవరి 29 డెడ్లైన్ను పొడిగించాలని ఆర్బీఐని శర్మ కోరుతున్నట్టూ తెలుస్తున్నది.