న్యూఢిల్లీ, జూలై 5: ఓలా ఉద్యోగులకు షాకివ్వబోతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 400 నుంచి 500 మంది సిబ్బందిని తీసివేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే క్విక్ కామర్స్ సేవలకు గుడ్బై పలికిన ఓలా..తాజాగా ఓలా డ్యాష్ సేవలను నిలిపివేసింది కూడా. కారు వ్యాపారంపై మరింత దృష్టి సారించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ డివిజన్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.
అన్ని విభాగాల్లో 1,000-1,100 మందిని తొలగించబోతున్నట్లు తెలిసింది. దీనిపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించారు. మరోవైపు, కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ డివిజన్ టాప్ గేర్లో దూసుకుపోతున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.