న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని సంస్థ తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆదివారం కంపెనీ స్కూటర్ను కొనుగోలు చేసిన వారు ఓలా సోనాను గెలుచుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది.
వీటిలో జెన్ 3 ఎస్ఐ ఎక్స్(2 కిలోవాట్), రోడ్స్టర్ ఎక్స్(2.5 కిలోవాట్)ను కేవలం రూ.49,999కి కొనుగోలు చేయవచ్చు. లిమిటెడ్ ఎడిషన్గా విడుదల చేసిన స్కూటర్ను 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్తో తయారు చేసింది. అలాగే రోడ్స్టర్ ఎక్స్+ 9.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్కు రూ.50 వేలు రాయితీ ఇస్తుండటంతో ఈ బైకు ధర రూ.1,39,999కి దిగిరానున్నది. ఈ బైకుపై ఎనిమిదేండ్ల వ్యారెంటీని కూడా కల్పిస్తున్నది. వాహనాలపై రూ.40 వేల వరకు సంస్థ డిస్కౌంట్ ఇస్తుండగా, మరో రూ.10 వేలు ఈఎంఐ రూపంలో లభించనున్నాయి.