TCS | న్యూఢిల్లీ, జూన్ 23: దేశీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఉద్యోగాల కోసం కొందరు రూ.100 కోట్ల లంచాలు తీసుకున్నట్టు బయటపడింది. సంచలనం సృష్టించిన ఈ స్కాంలో పలువురు సీనియర్ ఉన్నతోద్యోగుల పాత్ర ఉండగా, అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులపై ఇప్పటికే సంస్థ యాజమాన్యం వేటు వేసినట్టు చెప్తున్నారు. ఇక కొన్నేండ్లపాటు స్టాఫింగ్ సంస్థల నుంచి వారి అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పించినందుకుగాను లంచాలు తీసుకున్నట్టు టీసీఎస్ సీనియర్ ఉద్యోగులు అంగీకరించినట్టు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం చెప్తున్నది. కాగా, టీసీఎస్ సీఈవో, సీవోవోలకు కంపెనీలోని ఓ విజిల్బ్లోయర్ రాసిన లేఖతో ఈ స్కాం గుట్టు రైట్టెంది. రీసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి స్టాఫింగ్ సంస్థల నుంచి లంచాలు స్వీకరించినట్టు సదరు లేఖలో విజిల్బ్లోయర్ చెప్పారు.
ఆర్ఎంజీ ఉద్యోగులు ఔట్
ఈ స్కాం నేపథ్యంలో టీసీఎస్ తమ రీసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి నలుగురు ఉద్యోగులను తొలగించింది. అలాగే ఈ అవినీతిలో భాగమైన మూడు స్టాఫింగ్ సంస్థలపైనా నిషేధం విధించింది. విజిల్బ్లోయర్ ఇచ్చిన సమాచారం నిజమేనా? కాదా? అన్నది తెలుసుకోవడానికి టీసీఎస్.. ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈ కమిటీలో సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారి అజిత్ మేనన్ కూడా ఉన్నారు. దర్యాప్తు పూర్తయ్యాక కంపెనీ ఉద్యోగాల నియామక విభాగం అధిపతిని టీసీఎస్ సెలవుపై పంపించగా, ఆర్ఎంజీ నుంచి నలుగురిని తీసేసింది. చక్రవర్తిని ఆఫీస్కు రాకుండా డీబార్ చేసింది. ఆర్బీఎం డివిజన్లోని అరుణ్ జీకేను కూడా తొలగించింది.
3 లక్షల నియామకాలు
గడిచిన మూడేండ్లలో టీసీఎస్లో 3 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్టు ఆ సంస్థ ఉద్యోగి ఒకరు తెలిపారు. వీరిలో కాంట్రాక్టర్లూ ఉండగా, మొత్తం ఈ నియామక ప్రక్రియలో కమీషన్ల రూపంలో రూ.100 కోైట్లెనా చేతులు మారిందని సదరు ఉద్యోగి చెప్పారు. ఈ పరిణామంతో సంస్థలోని మొత్తం సీనియర్ ఉద్యోగులు షాకైనట్టు ఆయన అన్నారు.