NTPC | న్యూఢిల్లీ, జూలై 29: విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,907.13 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,977. 77 కోట్లతో పోలిస్తే 23 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.43, 560.72 కోట్ల నుంచి రూ.43,390.02 కోట్లకు పడిపోయింది.