Make in India | ‘భారత్లో పరిశ్రమలు పెట్టండి. ప్రోత్సహిస్తాం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అన్నీ ఉత్తవేనని మరోసారి తేటతెల్లమైంది. ప్రధాని మోదీ ఊదరగొట్టిన ‘మేకిన్ ఇండియా’ స్కీమ్.. ‘క్లోజింగ్ ఇండియా’గా మారిందని రూఢీ అయింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తయారీ రంగంలోని 10,655 సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ మేరకు పార్లమెంట్కు కేంద్రం ఇటీవల వెల్లడించింది. అలాగే గడిచిన ఐదేండ్లలో దేశంలోని 72 శాతం కంపెనీల్లో అసలు వృద్ధే లేదు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలన తీరిది.