న్యూఢిల్లీ: నోకియా సంస్థ అదరగొట్టే ఫీచర్స్తో 5 జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. గురువారం జరిగిన గ్రాండ్ ఈవెంట్లో నోకియా ఎక్స్ 20, నోకియా ఎక్స్ 10 సిరీస్లో ఏకంగా ఆరు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్తో స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ను జోడించిన ఈ ఫోన్లు వచ్చే నెలలో భారత్లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్లలో మొత్తం ఒక్కో సిరీస్లో మూడు రకాల ఫోన్ల చొప్పున నోకియా తీసుకొచ్చింది.
నోకియా ఎక్స్ 20 సిరీస్లో 8/128, 6/128 జీబీ, నోకియా ఎక్స్ 10లో 6/128 జీబీ, 6/64 జీబీ, 4/128 జీబీ వేరియంట్లలో ఫోన్లు ఉన్నాయి. ర్యామ్, స్టోరేజ్ కెపాసిటీ ఆధారంగా వాటి ధరలను నిర్ణయించారు. అన్ని ఫోన్లకు 6.6 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ 11, 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్, 32 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, 64+5+2+2 మెగా క్వాడ్ కెమెరా, 4,470 ఎంహచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?