No Rail Fare Concessions | కొన్ని వర్గాల ప్రజలకు ప్రయాణ టిక్కెట్లలో రాయితీలను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి వల్లే ఆ రాయితీని నిలిపి వేశామని రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కరోనా మహమ్మారి ప్రొటోకాల్ నేపథ్యంలో అన్ని క్యాటగిరీల ప్రయాణికుల రాయితీలను 2020 మార్చి 20 నుంచి ఉపసంహరించినట్లు తెలిపారు. నాలుగు క్యాటగిరీల వికలాంగులు, 11 క్యాటగిరీల విద్యార్థులు, రోగులకు మాత్రం మినహాయింపు ఉంది.
సీనియర్ సిటిజన్లతోపాటు విభిన్న వర్గాల వారికి 51 రకాల రాయితీలను భారతీయ రైల్వే కల్పించాయి. సీనియర్ సిటిజన్లకు అన్ని రైళ్లలో 50 శాతం డిస్కౌంట్ కల్పించారు. టీచర్లు, యుద్ధ వీరుల వితంతువులు, కళాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, రైతులు, వైద్య నిపుణులు తదితరులు విభిన్న రాయితీలు పొందుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
SBI’s ‘Monsoon Dhamaka’ |హోంలోన్లపై ఎస్బీఐ ఆఫర్…!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
Amazon Big win on Reliance | సింగపూర్ కోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే..!
Richest Person: బెజోస్ను వెనక్కి నెట్టిన లూయీ విటాన్ అధినేత