హైదరాబాద్, జూన్ 26: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. తొలుత 61 మిలియన్ డాలర్లు(రూ.500 కోట్లకు పైమాటే) పెట్టుబడి పెట్టబోతున్నది.
ఈ గోల్డ్ బ్లాక్ కోసం ఏపీ ప్రభుత్వంతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ప్రాంతీయ చట్టాల ప్రకారం ఈ బ్లాక్ కోసం మైనింగ్ లీజుకు తీసుకున్న మూడేండ్ల లోపు గని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 1.83 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు కలిగిన ఈ బ్లాక్లో టన్నుకు 5.15 గ్రాములు మాత్రమే బంగారం రానున్నదని అంచనా.