న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశీయ మార్కెట్లోకి సరికొత్త మ్యాగ్నైట్ ఈజెడ్ని పరిచయం చేసింది నిస్సాన్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.6,49,900గా నిర్ణయించింది. వచ్చే నెల 10 వరకు మాత్రమే అమలులో ఉండనున్న ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఎస్యూవీ, సెడాన్, హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో తక్కువ ధర కలిగినది ఇదే మాడల్ కావడం విశేషం.
ఈ నెల 10 నుంచి బుకింగ్లు ఆరంభించిన సంస్థ..ముందస్తుగా రూ.11 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన మాడల్ 1.0 లీటర కెపాసిటీతో రూపొందించింది.