గతవారం ట్రేడింగ్లో టాప్-10 స్టాక్స్లో తొమ్మిది సంస్థలు రూ.2.12 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా లబ్ధి పొందాయి. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మాత్రమే నష్టపోయింది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 844.68 పాయింట్లు లేదా 1.38 శాతం లాభ పడ్డాయి. గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మినహా గతవారం తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,12,478.82 కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.63,462.58 కోట్లు వృద్ధి చెంది రూ.8,97,980.25 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ. 36,517.34 కోట్లు లాభ పడి రూ.12,13,378.03 కోట్ల వద్ద నిలిచింది.
హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 29,422.52 కోట్లు వృద్ధి చెంది రూ.4,81,818.83 కోట్లకు చేరుకుంది. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.26,317.30 కోట్లు లాభ పడి రూ.17,80,206.22 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 23,626.96 కోట్లు పెరిగి రూ.6,60,650.10 కోట్ల వద్దకు చేరుకుంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,103.92 కోట్లు లాభ పడి, రూ.4,56,992.25 కోట్ల వద్ద స్థిర పడింది.
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,559.59 వృద్ధితో రూ.5,36,458.41 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ. 5,591.05 కోట్లు పెరిగి రూ.4,59,773.28 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 877.56 కోట్లు వృద్ధి చెంది రూ.6,32,192.05 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,912.07 కోట్లు పతనమై రూ.5,88,220.17 కోట్లతో సరిపెట్టుకుంది. టాప్-10 స్టాక్స్లో రిలయన్స్ లీడ్ వహిస్తుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.