న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత్ స్టాక్ మార్కెట్ను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) అప్గ్రేడ్ చేసింది. అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు లేకపోవడం, భారత్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం వంటి సానుకూల అంశాల కారణంగా ఈ ఏడాది డిసెంబర్కల్లా నిఫ్టీ 20,500 పాయింట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్ను అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్స్టాన్లీ అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదికను విడుదల చేస్తూ గతంలో నిఫ్టీకి తాము నిర్దేశించిన 19,000 పాయింట్ల లక్ష్యాన్ని 20,500 పాయింట్లకు పెంచుతున్నట్టు తెలిపింది, ఫైనాన్షియల్, ఫార్మాలపై ఓవర్వెయిట్ఫైనాన్షియల్, ఫార్మా, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్స్, కన్జూమర్ స్టేపుల్స్ షేర్లపై ఓవర్వెయిట్ అవుట్లుక్ను బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకటించింది. ఐటీ, యుటిలిటీస్, మెటీరియల్స్, డిస్క్రీషనరీస్ షేర్ల పట్ల అండర్వెయిట్ దృక్పథాన్ని వెల్లడించింది. నిఫ్టీ విలువలు తగ్గితే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి నిధులు తరలివస్తాయని, దీంతో క్షీణత పరిమితంగా ఉంటుందని అంచనా వేసింది.
ఎన్నికలే రిస్క్
భారత మార్కెట్కు వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలే పెద్ద రిస్క్ అని, యూఎస్ నుంచి ఏర్పడే రిస్క్ తక్కువేనని బ్యాంక్ విశ్లేషించింది. యూఎస్లో ఆర్థిక మాంద్యం వస్తుందని తాము భావించడం లేదని, ఈ కారణంగా మార్కెట్ తగ్గితే విదేశీ నిధులు తరలివస్తాయని, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు కొనసాగుతాయని అంచనా వేసింది. నిఫ్టీ షేర్లలో మూడవ వంతు షేర్లు వాటి దీర్ఘకాలిక సగటు విలువలకంటే తక్కువగానే లభిస్తున్నాయని, కొన్ని కొనుగోళ్లకు అనువుగా ఉన్నాయని తెలిపింది.