Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన సంవత్సరంలో ట్రేడింగ్లో తొలిరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్ 327.5 పాయింట్లు లాభపడింది. చివరకు 61,167.79 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ 92.90 పాయింట్లు పెరిగి, 18,197.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ ట్రేడింగ్లో దాదాపు 2,254 షేర్లు పెరగ్గా.. 1,254 షేర్లు క్షీణించాయి. మరో 177 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. టాటా స్టీల్ హిందాల్కో ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ దాదాపు 3 శాతం, రియల్టీ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి.