Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో పయనించాయి. ఇవాళ ఉదయం సెన్సెక్ 258 పాయింట్ల లాభంతో 62,983 పాయింట్ల వద్ద మొదలైంది. నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 18,672 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్ 418.45 పాయింట్ల లాభంతో 63,143.16 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 114.70 పెరిగి 18,716.20 వద్ద స్థిరపడింది. ఇవాళ్టి ట్రేడింగ్లో 2040 షేర్లు పురోగమించగా.. 1146 షేర్లు పురోగమించాయి. 126 షేర్లలో మార్పు కనిపించలేదు.
నిఫ్టీలో సిప్లా, టాటా కన్యూమర్స్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ అత్యధికంగా లాభపడ్డాయి. కొటక్ మహీంద్రా బ్యాక్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ అత్యధికంగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు రియాల్టీ 3 శాతం లాభంతో గ్రీన్ మార్క్లు ముగియగా.. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్, పీఎస్యూ బ్యాంక్ ఒక్క శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరిగాయి.