NEET PG Postpone | పీజీ వైద్యవిద్య, సూపర్స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి జరిగే నీట్ పీజీ సూపర్స్పెషాలిటీ ఎంట్రన్స్ రెండు నెలలు వాయిదా వేస్తామని కేంద్రం ప్రకటించింది. సవరించిన ప్రశ్నపత్రం సిలబస్తో విద్యార్థులు ప్రిపేర్ కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. చివరి క్షణంలో ఎంట్రన్స్ సిలబస్లో మార్పులేమిటని గతవారం కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కేంద్రం పై విధంగా అఫిడవిట్ దాఖలు చేసింది.
విద్యార్థులు మరింతగా సన్నద్ధమయ్యేందుకు నీట్-పీజీ ఎంట్రన్స్ను 2022 జనవరి 10,11 తేదీల్లో నిర్వహించేందుకు అనుమతించండి అని కేంద్రం కోరింది. సవరించిన సిలబస్తో ఎంట్రన్స్ నిర్వహణకే కట్టుబడి ఉన్నామని తెలిపింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 13, 14 తేదీల్లో నీట్-పీజీ ఎంట్రన్స్ నిర్వహించాల్సి ఉంది.