న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రముఖ హీరోయిన్ నయనతార తాజాగా చర్మసౌందర్య ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఆమె భర్త విఘ్నేష్ శివన్తో కలిసి ‘9స్కిన్’ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ డైసీ మోర్గాన్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వెంచర్కు ఎంతమేర పెట్టుబడులు పెట్టిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే నయనతార-విఘ్నేష్లు చాయి వాలాలో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం భారత్తోపాటు సింగపూర్, మలేషియాలో ఈ ప్రీమియం ఉత్పత్తులను విక్రయిస్తున్నది. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ..చర్మానికి ఎలాంటి హానీ కలుగకుండా ఉండే విధంగా 9స్కిన్ ఉత్పత్తులను తయారు చేసినట్లు చెప్పారు. భారత్లో స్కిన్కేర్ ఉత్పత్తుల మార్కెట్ విలువ 2028 నాటికి 10.31 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.