లండన్, మార్చి 20: మైక్రోసాఫ్ట్ కన్జ్యూమర్ కృత్రిమ మేధస్సు వ్యాపార అధిపతిగా ముస్తఫా సులేమాన్ నియమితులయ్యారు. టెక్నాలజీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన కృత్రిమ మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొన్నది.
ఈ విషయాన్ని సులేమాన్ తన బ్లాగ్లో రాసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవోగా త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు చెప్పారు. డీప్మైండ్ కో-ఫౌండర్ సులేమాన్ ఈ సంస్థను 2014లో గూగుల్కు విక్రయించారు.