న్యూయార్క్ : ట్విట్టర్ (ఎక్స్)ను ఎవ్రీథింగ్ యాప్గా మలచాలనే ఎలన్ మస్క్ (Elon Musk) స్వప్నం సాకారం కానుంది. అన్ని ఆర్ధిక అవసరాలకు ఎక్స్ను సరైన అడ్డాగా మలచాలనే మస్క్ విజన్ ఫలించే దిశగా అడుగులు పడుతున్నాయి. పెన్సిల్వేనియాలో ఎక్స్కు మనీ ట్రాన్స్మిటర్ లైసెన్స్ లభించింది. దీంతో ఇక ఎక్స్ వేదికపై డబ్బులు పంపడంతో పాటు చెల్లింపులు చేపట్టే వెసులుబాటు కలుగుతుంది.
ఏడాది కిందట ట్విట్టర్ను టేకోవర్ చేసిన సందర్భంలోనూ మస్క్ తన విజన్ను స్పష్టంగా వెల్లడించారు. ఎక్స్పై ప్రజలు తమ ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడం కంటే ఇంకా ఎక్కువగా ఈ ప్లాట్ఫాంను ఉపయోగించుకునేలా మలచాలని తాను కోరుకుంటున్నానని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక ఎక్స్ పెన్సిల్వేనియాలో మనీ ట్రాన్స్మిటర్ లైసెన్స్ను పొందడంతో మస్క్ తన విజన్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే దిశగా కసరత్తు సాగిస్తున్నారు.
అమెరికాలో ఎక్స్ ఇలాంటి లైసెన్స్ పొందడం ఇది 13వది కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ తమ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్ను ఉపయోగించుకోవాలని మస్క్ కోరుకుంటున్నారని గతంలో వెర్జ్ రిపోర్ట్ వెల్లడించింది. 2024 సంవత్సరాంతానికి ఈ దిశగా ఎక్స్ సంసిద్ధమవుతుందని కూడా పేర్కొంది.
Read More :