Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ ( Reliance Industries) కొత్త శకానికి నాంది పలికింది. సంస్థ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసులు.. ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఈశా అంబానీలను డైరెక్టర్ల బోర్డులోకి చేర్చుకుంది (Get Shareholders). ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం వెల్లడించింది.
గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో తన పిల్లలు అనంత్, ఆకాశ్, ఈషాలకు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా స్థానం కల్పిస్తున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురినీ ఆర్ఐఎల్ బోర్డ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారుల అనుమతిని కోరుతూ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదార్లకు రిలయన్స్ పంపింది. తాజాగా ముకేశ్ పిల్లల్ని రిలయన్స్ బోర్డులోకి చేర్చుకునేందుకు వాటాదారుల నుంచి ఆమోదం లభించింది. ఈ మేరకు కవలలైన 32 ఏళ్ల ఈషా, ఆకాశ్ అంబానీలకు 98 శాతానికి పైగా ఓట్లు రాగా.. ఇక 28 ఏళ్ల అనంత్కు 92.75 శాతం ఓట్లు వచ్చాయి. ముగ్గురు అంబానీ వారసులు గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్కి చెందిన కీలక వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న అంబానీ ముగ్గురు పిల్లలకు జీతాల్లేవు. అయితే బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు ఫీజులు మాత్రం చెల్లిస్తారు. అలాగే సంస్థ లాభాలపై కమీషన్నూ తీసుకుంటారు. ఈ విషయాన్ని సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ముకేశ్ అంబానీ కూడా 2020-21 నుంచి జీతం తీసుకోకుండా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు మాత్రం 2008-09 నుంచి 2019-20 వరకు ఏటా రూ.15 కోట్లు తీసుకుంటూ వచ్చారు. కానీ కరోనా నేపథ్యంలో 2020-21 నుంచి జీతాన్ని తీసుకోబోనని ప్రకటించారు. ఆర్ఐఎల్ గ్రూప్లోని అన్ని వ్యాపారాలు పూర్తిస్థాయిలో లాభాలను సంతరించుకునేదాకా ఇంతేనని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ముకేశ్ పిల్లలూ జీతాలు తీసుకోబోవడం లేదు.
Also Read..
Virat Kohli | క్రికెటర్లు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు.. ప్రపంచకప్లో కోహ్లీ ఫుడ్ మెనూ ఏంటో తెలుసా?
Israel-Hamas War | ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురు హమాస్ కీలక కమాండర్లు హతం
Israel-Hamas War | ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మృతి.. ప్రకటించిన హమాస్