Stocks Monday Mayhem | కొన్ని వారాలుగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం రివర్స్గేర్లో వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. సోమవారం ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు స్క్రిప్ట్ల విక్రయానికి తెగబడ్డారు. దీంతో రూ.3.78 లక్షల కోట్ల మేరకు నష్టపోయారు. దీని ప్రకారం ప్రతి నిమిషానికి ఇన్వెస్టర్లు రూ.1000 కోట్ల పైగా సంపదను కోల్పోవాల్సి వచ్చింది. ఇక బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.255.18 లక్షల కోట్లకు పడిపోయింది.
దేశీయ స్టాక్మార్కెట్లు దెబ్బ తినడానికి చైనాలో ఎవర్గ్రాండ్ క్రైసిస్, కమోడిటీ ధరల్లో క్షీణత తీవ్రంగా ప్రభావం చూపింది. మెటల్ స్టాక్స్ భారీగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఎఫ్ఎంసీజీ స్క్రిప్ట్లపై కొనుగోళ్ల ఒత్తిడి కనిపించింది. స్థూలంగా ఇన్వెస్టర్లు రూ.3.78 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈ-30 ఇండెక్స్ 524.96 పాయింట్లు పడిపోయి 58,490.93 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 188.25 పాయింట్ల పతనంతో 17,396.90 పాయింట్ల వద్ద సరిపెట్టుకున్నది.
ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి మరింత చిక్కిపోయింది. ఒక డాలర్ ధర 73.82 రూపాయల వద్ద ప్రారంభమై 26 పైసలు నష్టపోయి రూ.73.74 వద్ద ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్ ధర రూ. 73.48 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ పరిస్థితులతో సెన్సెక్స్లో 24 స్క్రిప్ట్లు రెడ్లోనే కొనసాగాయి. టాటా స్టీల్ 10 శాతం, ఎస్బీఐ నాలుగు శాతం నష్టపోయాయి. ఫైనాన్సియల్, మెటల్ స్టాక్స్ పతనంతో మార్కెట్లో డౌన్ ట్రెండ్ కొనసాగింది. బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ భారీగా నష్టపోయాయి.
ఇక హెచ్యూఎల్ 2.96 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.10, ఐటీసీ 0.91 శాతం లబ్ధి పొందాయి. టాటా స్టీల్ 10 శాతం, ఎస్బీఐ 3.69, ఇండస్ ఇండ్ 0.91 శాతం నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని సెక్టార్ల స్క్రిప్టులు రెడ్లోనే సాగాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ప్రచారం.. రేవంత్పై కోర్టులో కేటీఆర్ పిటిషన్
#RahulDrugTest: రాహుల్ డ్రగ్టెస్ట్.. ట్విట్టర్లో ట్రెండింగ్
Stock markets: భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
న్యూ డుకాటి మాన్స్టర్ బుకింగ్స్ షురూ : ధర ఎంతంటే..!